ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ పై జగన్ ఎందుకు స్పందించరు: బుద్దా వెంకన్న

ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ పై జగన్ ఎందుకు స్పందించరు: బుద్దా వెంకన్న
బాబాయ్ కి బాత్రూమ్ ట్రీట్మెంట్, ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ ట్రీట్మెంట్

సొంత పార్టీకి చెందిన ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైతే సీఎం జగన్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ పై డీజీపీ అల్లిన కట్టుకథకు సెల్యూట్ చేస్తున్నాని ఎద్దేవా చేశారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతంపై కేంద్రం సుమోటోగా తీసుకుని సీబీఐ విచారణ జరిపితేనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. బాబాయ్ కి బాత్రూమ్ ట్రీట్మెంట్, ఎంపీ కుటుంబానికి కిడ్నాప్ ట్రీట్మెంట్ లాగ రేపు తన పరిస్థితి ఏంటోననే భయంతో విజయసాయి రెడ్డి ఉన్నారని చెప్పారు.

సీఎం జగన్ నుంచి తనకు ప్రాణహానీ పొంచి ఉందని విజయసాయి రెడ్డి కి తెలుసని అన్నారు బుద్దా వెంకన్న. విశాఖలో జరిగిన రూ.60వేల కోట్ల భూ కుంభకోణం దందాలో వాటాలు తేడాలు వచ్చినందుకే ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయిందని ఆరోపించారు. కోడాలి నాని బతుకే ఓ లాలూచీ బతుకని అన్నారు. నోటికొచ్చిన అబద్దాలు చెప్పే కొడాలి నాని అన్నం తింటున్నాడా గుట్కాలు తింటున్నాడా అని ఎద్దేవా చేశాడు. సెంటు భూమి పేరుతో నాని చేసిన కుంభకోణంపై టీడీపీ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గుడివాడ ప్రజలు కొడాలినానికి ఎప్పుడో గోరీ కట్టారని. ఒళ్లు కొవ్వెక్కి దిగిన బుల్లెట్ తెలియట్లేదంతే అనే సినిమా డైలాగ్ ను పేల్చారు.

Tags

Read MoreRead Less
Next Story