అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం జగన్

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం జగన్
ఏపిలో యావత్ హిందూసమాజం ఆందోళనతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చింది. అంతర్వేది రధం దగ్ధం ఘటనపై ఎట్టకేలకు సీఎం వైఎస్..

ఏపిలో యావత్ హిందూసమాజం ఆందోళనతో వైసీపీ ప్రభుత్వం దిగివచ్చింది. అంతర్వేది రధం దగ్ధం ఘటనపై ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ విచారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు కోరుతూ.. కేంద్ర హోమ్ శాఖకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. అలాగే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శుక్రవారం జీవో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Tags

Read MoreRead Less
Next Story