ఏపీలో కొత్తగా 3,620 మందికి కరోనా

ఏపీలో కొత్తగా 3,620 మందికి కరోనా

ఏపీలో కరోనా విజృంభణ ఆగేలా లేదు.. గత 24 గంటల్లో 76,726 శాంపిల్స్‌ ని పరీక్షించగా కొత్తగా 3,620 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల గుంటూరు లో నలుగురు, చితూర్‌ లో ఇద్దరు, తూర్పు గోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, అనంతపూర్‌ లో ఒక్కరు, కడప లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు , పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 3,723 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 7,94,024 పాజిటివ్ కేసు లకు గాను 7,55,243 మంది డిశ్చార్జ్ కాగా.. 6,524 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,257 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story