అమరావతి రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుచేటు : సీపీఐ

X
kasi30 Oct 2020 9:57 AM GMT
అమరావతి రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడం సిగ్గుచేటన్నారు... శ్రీకాకుళం జిల్లా సీపీఐ నేత నర్సింహులు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా... స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి... వినతిపత్రం సమర్పించారు. నలుగురికి అన్నం పెట్టే రైతన్నలను అవమానించడం దారుణమన్నారు. అంబేద్కర్ కల్పించిన హక్కులను.. ఈ పాలకులు భంగం కల్పిస్తున్నారని నర్సింహులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
Next Story