మల్లెమడుగు వాగులో గల్లంతైన రైతు మృతదేహం గుర్తింపు
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో విషాదం నెలకొంది. జింకలమిట్ట దగ్గర మల్లెమడుగు వాగులో గురువారం చిక్కుకున్న రైతు మృతదేహం శనివారం బయటపడింది. శుక్రవారం భారీగా వరద ధాటికి మల్లెమడుగు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. వరద ఉధృతిలో చాలా సమయం వరకు చెట్టును పట్టుకునే ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే ఉధృతి మరింత అధికమవ్వడంతో వాగులో కొట్టుకుపోయారు. అందులో లోకేష్, వెంకటేషన్లను వెంటనే రెస్క్యూటీం కాపాడింది. మరో రైతు ప్రసాద్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. గల్లంతైన ప్రసాద్ కోసం ఎన్టీఆర్ఎఫ్ టీం... మల్లెమడుగు వాగులో ముమ్మరంగా గాలించింది.. అయితే కాసేపటి కిందట అతడి మృతదేహాన్ని వాగు ఒడ్డున గుర్తించారు. దీంతో గ్రామంలో పెను విషాదం నెలకొంది. రైతు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com