చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్
By - Nagesh Swarna |10 Dec 2020 12:18 PM GMT
చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు పంటపొలాలపై దాడులు చేస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. శాంతిపురం మండలం, ఎం.కే.పురం, ముళ్లూరు, మఠం గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ దాడులు జరుపుతున్నాయి. పంటపొలాలను నాశనం చేస్తుండటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. వాటిని తిరిగి అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గజరాజాలు ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తాయో తెలియక.. అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com