రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి - దేవినేని ఉమా

X
ఏపి ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఏమన్నా అంటే గూగుల్ సెర్చ్ చేయమంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని ఉమ ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారని ఆయన మండిపడ్డారు. 17నెలల పాలనలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం 170 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి వెయ్యికోట్లు ఖర్చుచేసినట్లు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
