రాజధానిలో ఆగిన మరో రైతు గుండె
By - Nagesh Swarna |4 Oct 2020 12:44 PM GMT
రాజధాని ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. యర్రబాలెంలో రైతు గడ్డం వెంకటేశ్వర్రావు ఇవాళ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని కోసం 4.25 ఎకరాలు భూమిని ఇచ్చారు. ఐతే.. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల మాట ఎత్తుకోవడంతో తమ భవిష్యత్ ఏమవుతుందోనని కొన్నాళ్లుగా ఆయన ఆందోళనలో ఉన్నారు. రాజధాని మార్పు, తన ప్లాట్ ఇంకా రాని విషయం ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో.. మనస్తాపానికి గురైన ఆయన ఆ ఒత్తిడితో మరణించారని గ్రామస్థులు అంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com