పోలీసుల తీరుపై మండిపడిన మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి

పోలీసుల తీరుపై  మండిపడిన మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి
కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను ప్రారంభించాలంటూ టీడీపీ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి..

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను ప్రారంభించాలంటూ టీడీపీ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి. పోలీసుల తీరుకు నిరసనగా... చిత్తూరు కలెక్టర్‌, ఎస్పీలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్‌ బీజం వేస్తే... చంద్రబాబు దాదాపు పూర్తి చేశారన్నారు. తంబళ్లపల్లె నుంచి పలమనేరు వరకు పనులు పూర్తి చేయించారన్నారు. పెండింగ్‌లో ఉన్న 14శాతం పనులు పూర్తి చేయాలంటూ.... టీడీపీ మహాపాదయాత్ర చేపట్టిందన్నారు. జగన్‌ ప్రభుత్వం కావాలనే... ఈ ప్రాజెక్ట్‌ను ఆపివేసిందన్నారు. తక్షణమే హంద్రీనివా కాలువ ద్వారా... జిల్లాలోని చెరువుల్ని నింపాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story