పోలవరంలో 125 అడుగుల 'వైఎస్' విగ్రహం పెడతారట : మాజీ మంత్రి దేవినేని
By - kasi |18 Nov 2020 11:36 AM GMT
పోలవరంలో 125 అడుగుల వైఎస్ విగ్రహం పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమైందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ. వైఎస్ విగ్రహం పెట్టుకోవడానికి మంత్రి అనిల్ను సీఎం జగన్....... పోలవరానికి పంపారన్నారు. 254 కోట్లతో పోలవరంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. వరదలకు మంచినీళ్ల ప్యాకెట్ ఇవ్వని ప్రభుత్వం... పోలవరం వద్ద వైఎస్ విగ్రహం పెడతానంటోందంటూ విమర్శించారు. నిర్వాసితులను గాలికి వదిలేసి... వైఎస్ విగ్రహం పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com