ఇద్దరమ్మాయిలు మధ్య చిగురించిన ప్రేమ.. ఇంట్లో రూ.50 వేలు తీసుకుని..

ఇద్దరమ్మాయిలు మధ్య చిగురించిన ప్రేమ.. ఇంట్లో రూ.50 వేలు తీసుకుని..

అమ్మాయి-అబ్బాయి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారడం చూశాం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ ఇద్దరమ్మాయిలు ప్రేమించుకుని.. అది కూడా ఇంట్లో నుంచి పారిపోవడం ఎప్పుడైనా చూశారా? అవును కర్నూలు జిల్లాలో ఇలాంటి వింతే జరిగింది. కర్నూలు సంతోష్‌నగర్‌కు చెందిన సిమ్రాన్‌... నరసింహారెడ్డి నగర్‌కు చెందిన పుష్పలతలు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ అన్నింటికి విరుద్ధంగా ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ మొదలైంది. ఒకరు లేకుంటే మరొకరు జీవించలేమన్న పరిస్థతికి వచ్చారు. ఇలా రెండేళ్ల పాటు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనుకున్నారో ఏమో.. ఇంట్లో నుంచి పారిపోవాలని ఇద్దరమ్మాయిలు డిసైడ్‌ అయ్యారు. కాలేజీకి వెళ్తున్నమంటూ ఇంట్లో నుంచి పారిపోయారు. పుష్పలత, తాను రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని... ఇద్దరం ప్రశాంతంగా జీవించాలనుకున్నట్లు తన తల్లికి మెసేస్‌ పెట్టింది సిమ్రాన్‌. తమ కోసం ఎవరూ గాలించవద్దని.. ఇష్టపూర్వకంగానే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఖంగు తిన్నారు.

అటు పుష్పలత తల్లి పార్వతమ్మ కూడా ఈ పరిణామంతో షాక్‌కు గురైంది. తన కూతురు ఇంట్లో ఉన్న 50 వేలు కూడా తీసుకునిపోయినట్లు వాపోయింది. దీంతో చేసేదేమిలేక ఇద్దరమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ చూడలేదని.. యువతుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story