అరకులోయ పర్యాటకులకు శుభవార్త

అరకులోయ పర్యాటకులకు శుభవార్త
అరకులోయ ప్రియులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరకులోయ వరకు గ్లాస్‌టాప్‌ కోచ్‌లను ప్రవేశపెడతామని తెలిపింది

అరుకులోయ ప్రియులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ నుంచి అరకులోయ వరకు గ్లాస్‌టాప్‌ కోచ్‌లను ప్రవేశపెడతామని తెలిపింది. ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉన్న విస్టాడోమ్‌ కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్టు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ లేఖ రాశారు. రైల్యేశాఖ విశాఖ-అరకు రైలులో తీసుకొచ్చిన విస్టాడోమ్‌కు పర్యాటకుల నుంచి అభించిందని.. అయితే, విస్టాడోమ్ కోచ్ ఒక్కటే ఉండటతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవలసిన పరిస్తితి ఏర్పడిందన విజయసాయి రెడ్డి గతంలో రైల్వేశాఖకు తెలిపారు. మరిన్న కోచ్ లు తీసుకొని వస్తే.. పర్యాటక రంగానికి బాగుంటుందని తెలిపారు. విజయసాయి చేసిన విజ్ఞప్తిపై రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్‌ కోచ్‌లను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం విస్టాడోమ్‌ కోచ్‌లు తయారీలో ఉన్నాయని, త్వరలోనే వాటిని పర్యాటకులకు అందుబాటులోని తీసుకొని వస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story