వైసీపీకి అనుకూలంగా లేకపోతే ప్రభుత్వ పథకాలు నిలిపివేత..
వైసీపీకి అనుకూలంగా లేకపోతే, ఆ పార్టీలో చేరకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్నారా అంటే ఔననే సమాధానం..

వైసీపీకి అనుకూలంగా లేకపోతే, ఆ పార్టీలో చేరకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది విజయనగరం జిల్లాలో. అక్కడి భోగాపురం మండలం పొలిపల్లి గ్రామంలో వైసీపీకి అనుకూలంగా లేరనే కారణంగా తమకు వైఎస్సార్ చేయూత పథకం ఆపేశారంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా అర్హులుగా ఉన్నా తమపై కక్షకట్టినట్టు వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కొంతమందికి పెన్షన్లు తొలగించారని, మరి కొంతమందిని వైసీపీ పార్టీలో చేరాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారంటున్నారు. పథకాల్లో అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు గ్రామస్థులు. వైఎస్సార్ చేయూత పథకానికి రెండవ సారి అవకాశం వచ్చినా మళ్లీ అనర్హులుగానే గుర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT