భద్రాద్రి కొత్తగూడెంలో గవర్నర్ తమిళిసై
By - Subba Reddy |17 May 2023 3:45 AM GMT
తెలంగాణ గవర్నర్ తమిళిసై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు
తెలంగాణ గవర్నర్ తమిళిసై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి రైలులో కొత్తగూడెం చేరుకున్న గవర్నర్కు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడనుంచి.. రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు. ముందుగా సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్కు చేరుకుని అనంతరం భద్రాద్రి రాముడిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత గిరిజనుల ఆరోగ్యంపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మంకు చేరుకోనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com