గుంటూరు జిల్లాలో మరో దళిత యువకుడిపై దాడి
BY Nagesh Swarna11 Sep 2020 4:01 AM GMT

X
Nagesh Swarna11 Sep 2020 4:01 AM GMT
గుంటూరు జిల్లాలో దళిత యువకుడిపై దాడి జరిగింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది ఓ దళిత యువకుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దళిత వాడలో హల్ చల్ చేస్తూ.. భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన బాపట్ల మండలం మరుప్రోలుపాలెం ఇందిరానగర్లో చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో అగ్రకులానికి చెందిన కొందరు..ఓ దళిత యువతితో అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా... ఆ యువతి తమ్ముడు భాస్కర్ పై దాడికి పాల్పడ్డారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఇందిరానగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
Kurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన...
17 May 2022 9:15 AM GMTKiran Kumar Reddy : కిరణ్కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
17 May 2022 6:51 AM GMTWeather Report : తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు
17 May 2022 3:00 AM GMTTDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన...
16 May 2022 3:50 PM GMTAvanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం...
16 May 2022 2:30 PM GMTEluru: ఏపీలో జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే...
16 May 2022 1:30 PM GMT