గుంటూరు జిల్లాలో మరో దళిత యువకుడిపై దాడి

గుంటూరు జిల్లాలో మరో దళిత యువకుడిపై దాడి

గుంటూరు జిల్లాలో దళిత యువకుడిపై దాడి జరిగింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది ఓ దళిత యువకుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా దళిత వాడలో హల్ చల్ చేస్తూ.. భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన బాపట్ల మండలం మరుప్రోలుపాలెం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలో అగ్రకులానికి చెందిన కొందరు..ఓ దళిత యువతితో అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా... ఆ యువతి తమ్ముడు భాస్కర్ పై దాడికి పాల్పడ్డారు. కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఇందిరానగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story