Hindupuram: హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం..

Hindupuram: హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం..

హిందూపురంలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌ రెచ్చిపోయాడు. స్థలం వివాదంలో స్థానికులతో వాగ్వాదానికి దిగిన శ్రీరాంరెడ్డి అనే హెడ్‌ కానిస్టేబుల్ మీ అంతు చూస్తా... నరికేస్తానంటూ జనంపై విరుచుకుపడ్డాడు. తాను ఆషామాషీ రెడ్డిని కాదని ధర్మవరం రెడ్డినంటూ వీరంగం సృష్టించాడు. అయితే స్థానికులు ఎంతకీ తగ్గకపోవడంతో అక్కడ నుంచి జారుకున్నాడు. శ్రీరాంరెడ్డిపై హిందూపురం వన్‌ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు స్థానికులు.

పట్టణంలోని దండు ప్రాంతంలో ఓ స్థలాన్ని హెడ్‌ కానిస్టెబుల్‌ శ్రీరాంరెడ్డి బంధువులు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో శ్రీరాంరెడ్డితో పాటు బంధువులు ప్రధాన రోడ్డులో ఉన్న మట్టిని జేసీబీతో తమ స్థలంలో వేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు దీన్ని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీరాంరెడ్డి రెచ్చిపోయాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. అటు ప్రజలు సైతం వాగ్వాదానికి దిగారు. స్థానికులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో శ్రీరాం రెడ్డి అక్కడనుంచి వెళ్లిపోయాడు. శ్రీరాం రెడ్డి తీరుపై మండిపడిన స్థానికుల ఆయనపై సీఐకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ సీఐ సైతం హెడ్‌ కానిస్టేబుల్‌కు అండగా నిలిచినట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు.

Tags

Read MoreRead Less
Next Story