క్వారెంటైన్‌ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది?- బండారు

క్వారెంటైన్‌ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది?- బండారు

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి. కరోనా పేషేంట్లు అయినా ఒక నెలలో హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు గానీ తాడేపల్లి క్వారంటైన్ లో ఉంటున్న దేముని బిడ్డ మాత్రం నెలల తరబడి బయటకు రావడం లేదంటూ ఎద్దేవా చేశారు. కేసుల భయానికి ఒక్క ఢిల్లీకి మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నారన్నారు. వానొచ్చినా వరదొచ్చినా చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా.. ఆ కాలు బయటకు కదలడం లేదన్నారు. సీబీఐ కోర్టుకు రోజూ రమ్మంటే కళ్ళ నుంచి కృష్ణ గోదావరి వరదలేనా? క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది? అంటూ.. ట్విట్‌ చేశారు బండారు సత్యనారాయణ మూర్తి.

Tags

Read MoreRead Less
Next Story