Hyderabad : తిరుమలగిరిలో ముగ్గురు బాలికల అదృశ్యం
తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకలకు బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలికల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు స్నేహితుల ఇంట్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదృశ్యమయిన వారిలో ఓ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ స్విచాప్ చేసినట్లు తెలుస్తోంది
9వ తరగతి చదువుతున్న మరియా అనే విద్యార్థి తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులైన హసీనా, సక్న లతో కలిసి పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు... ఇంటికి చేరుకోకపోవడం, వారి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుండడం తో కుటుంబ సభ్యులు తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com