ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్న జగన్ : సుంకర పద్మశ్రీ
By - kasi |10 Oct 2020 9:10 AM GMT
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు అమరావతి మహిళా జేఏసీ కన్వీనర్ సుంకర పద్మశ్రీ. వైసీపీ నేతలు, మంత్రులు రైతులను అవమానపరిచే విధంగా..పెయిడ్ ఆర్టిస్టులంటూ మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతి ఉద్యమం 3వందల రోజులకు చేరుతున్న నేపథ్యంలో మహిళా జేఏసీ నేతలు తమ కార్యాచరణను ప్రకటించారు. అన్నిరాజకీయపార్టీలు, కులాలతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతామన్నారు. ఈనెల 11న రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లవద్ద నిరసనలు... 12వ తేదీన రెవెన్యూ కార్యాలయాలవద్ద ధర్నా చేపట్టనున్నట్లువెల్లడించారు. రేపు విజయవాడలోని శారదా కాలేజీ వద్ద భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com