జగన్ 70 కోట్లు ఇస్తానని ప్రకటించడం నమ్మశక్యంగా లేదు : పోతిన మహేష్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు..
BY kasi22 Oct 2020 9:53 AM GMT

X
kasi22 Oct 2020 9:53 AM GMT
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగి పడిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని జనసేన నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ప్రాణ నష్టం జరిగితేగానీ ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు. కొండ చరియలు విరిగి
పడిన ఘటన ప్రమాదావశాత్తు జరిగింది కాదని... అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్లనే జరిగిందని మహేష్ ఆరోపించారు. దసరాను రాష్ట్ర ఉత్సవంగా గత ఏడాది ప్రకటించినా... ఇంతవరకు నిర్వహణా ఖర్చులు ఇవ్వలేదన్నారు. అలాంటి జగన్ ఇప్పుడు ఆలయ అభివృద్ధికి 70 కోట్లు ఇస్తానని ప్రకటించడం నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు.
Next Story
RELATED STORIES
Ministry of Defence Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో రక్షణ...
18 May 2022 4:37 AM GMTDrone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMT