విశాఖలో రూ.10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలం కబ్జాకు యత్నం

విశాఖలో రూ.10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలం కబ్జాకు యత్నం

విశాఖ మధురవాడలో 10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు కొందరు అక్రమార్కులు. అసలు యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జామి సత్యరవికిశోర్‌తో సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. మధురవాడలోని దుర్గానగర్‌లో ఉన్న సర్వే నెంబర్‌ 249/10లో కబ్జాకు యత్నించినట్లు ఏసీపీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీరు ప్రహరీగోడను తొలగించి బెదిరింపులకు దిగారని వెల్లడించారు. 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుల్ని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story