పెళ్లి పెట్టిన చిచ్చు.. ఎనిమిది మందికి గాయాలు

పెళ్లి పెట్టిన చిచ్చు.. ఎనిమిది మందికి గాయాలు
బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సవిరిగాన ఆనందరావు కుమార్తె వందన ..అదే గ్రామానికి చెందిన జగ్గుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణారావు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు

శ్రీకాకుళం జిల్లాలో ఓ పెళ్లి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. ఘర్షణకు దారి తీసి.. గాయాలపాలయ్యేలా చేసింది. బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సవిరిగాన ఆనందరావు కుమార్తె వందన ..అదే గ్రామానికి చెందిన జగ్గుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణారావు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఆనందరావు కుటుంబ సభ్యులు తమ పాప ఎక్కడుందంటూ వెంకట్రావు కుటుంబ సభ్యులను నిలదీయడంతో గొడవ మొదలైంది. అనంతరం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మద్య కొట్లాట జరిగింది. ఇందులో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story