భవిష్యత్తులో రైతు ఉద్యమం : ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
By - kasi |4 Nov 2020 12:01 PM GMT
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ వ్యతిరేకించిన విద్యుత్ మీటర్లను ఈరోజు జగన్ ఎలా అంగీకరించారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రైతులను దొంగలుగా చూపించేందుకే జగన్ వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లకు అంగీకరించారని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో నిమ్మల పాల్గొన్నారు. రైతుల పక్షాన టీడీపీ నిలబడుతుందని, భవిష్యత్తులో రైతు ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com