ప్రజల్లోకి వెళ్లే హక్కు నాకులేదా చెప్పండి : నారా లోకేశ్
By - Nagesh Swarna |19 Oct 2020 11:30 AM GMT
వరదల్లో సర్వం కోల్పోయిన రైతుల్ని, ప్రజల్ని పరామర్శిస్తుంటే... తనపై మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రజల్లోకి వెళ్లే హక్కు తనకు లేదా అని ఆయన మంత్రులను ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రశాంతంగా ఉండలేకే తాను వరద ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి వరద ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్.. వరద బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తుంటే.. ప్రభుత్వంలో చలనం లేదని ఆయన మండిపడ్డారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com