Nellore: కోటంరెడ్డిపై మండిపడ్డ ఆనం విజయ్కుమార్
By - Subba Reddy |1 Feb 2023 10:00 AM GMT
వైసీపీ ఇచ్చిన గుర్తింపుతోనే కోటంరెడ్డి లీడర్గా ఎదిగారని ఘాటు వ్యాఖ్యలు
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ, వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ మండిపడ్డారు. నాయకులకు ఎదిగే అవకాశం ఇచ్చిన పార్టీని వదిలేందుకు కొందరు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఇచ్చిన గుర్తింపుతోనే కోటంరెడ్డి లీడర్గా ఎదిగారని గుర్తు చేశారు. ఎంతోమంది లీడర్లు ఉన్నా పార్టీ కోటంరెడ్డికి అవకాశం ఇచ్చిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కోటంరెడ్డి ధోరణి మారిందని ఆర్థికంగా ఎదిగేందుకు ఆయన ఎంచుకున్న దారులు పతనానికి దారి తీశాయన్నారు. ఆనం గొంతులో టీడీపీ మాటలు వినిపిస్తున్నాయని ఆనం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. వైఎస్సార్కు ఆనం అంటే ఎంతో అభిమానమన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో మంత్రి అనిల్ను ఆనం ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com