అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది
By - kasi |2 Oct 2020 6:38 AM GMT
అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర్రావు మృతితో ఒక్కసారిగా విషాదం నెలకొంది. రాజధాని నిర్మాణానికి 25 సెంట్ల భూమి ఇచ్చిన నాగేశ్వర్రావు.. 3 రాజధానుల నిర్ణయంతో అమరావతికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు. ఇటీవలి పరిణామాలతో మరింత మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతు నాగేశ్వర్రావుకు దీక్షా శిబిరంలో అంతా నివాళులు అర్పించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com