తిరుపతి జూపార్క్‌లో విషాదం.. పులి కూన మృతి

తిరుపతి జూపార్క్‌లో విషాదం.. పులి కూన మృతి
తల్లికి దూరమై తిరుపతి జూపార్క్‌కు చేరిన నాలుగు పులి కూనల్లో ఒకటి మృతి చెందింది

తిరుపతి జూపార్క్‌లో విషాదం నెలకొంది. తల్లికి దూరమై తిరుపతి జూపార్క్‌కు చేరిన నాలుగు పులి కూనల్లో ఒకటి మృతి చెందింది. కిడ్నీ చెడిపోవడం, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో.. పులి పిల్ల మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టం తర్వాత జూలోనే పులి కూనకు దహన సంస్కారం నిర్వహించారు. అటు జూపార్క్‌ వైద్యుల తీరును జంతు ప్రేమికులు తప్పుబడుతున్నారు. పులి కూన అనారోగ్యాన్ని జూవైద్యులు ముందుగా గుర్తించలేదని ఆరోపించారు. మార్చి నెలలో పులి పిల్లలు నల్లమల అటవీ ప్రాంతం నుంచి తిరుపతి జూకు చేరాయి. మిగిలిన 3 పులి పిల్లలకు నిన్నటి నుంచి ప్రత్యేక వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని జూ వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story