ఈ-సేవలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్‌

ఈ-సేవలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్‌

ఈ-సేవలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. 17 ఏళ్ల నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారని అన్నారు. ఈ-సేవ ఉద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు. అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో 607 ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ-సేవ ఉద్యోగులకు ఉపాధికి లేక కుటుంబాల పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలకు సేవలు అందిస్తూ... ఈ-సేవ ఉద్యోగాలను నమ్ముకొని బతుకుతున్న వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని అన్నారు. సేవా రుసుముల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని, ఈ-సేవ కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story