ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం!

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ప్రారంభం!
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు (1-5 వ తరగతి) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు (1-5 వ తరగతి) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా స్కూళ్లు నిర్వహిస్తామని.. ప్రతి క్లాసు రూంలో 20 మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. గదులు సరిపోని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో క్లాసులు నిర్వహిస్తామని.. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీ ఉంటేనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతి ఇస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story