ఏపీ సీఎం జగన్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. అమరావతే ఎజెండాగా ఉప ఎన్నిక పెడితే ముఖ్యమంత్రిని సైతం రెండు లక్షల మెజారిటీతో ఓడిస్తానన్నారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్గా తనను తప్పించడంపై కొందరు వైసీపీ సోషల్ మీడియా భక్తులు అవాకులు చవాకులు పేలుతున్నారని.. వారందరికీ ఇదే నా ఘాటైన సమాధానమంటూ వ్యాఖ్యానించారు రఘురామ. పార్లమెంటు కమిటీ ఛైర్మన్గా పూర్తికాలం బాధ్యతలు నిర్వహించానని, ఇప్పుడు ఆ పదవిని ముఖ్యమంత్రి తన సాటి మతస్తుడికి ఇచ్చుకున్నారని అన్నారు. మూడు నెలలు ఆగితే ఎవరి పదవి పోతుందో మీరే చూస్తారంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తన సొంత పరపతిపై సాధించిన పార్లమెంట్ కమిటీ ఛైర్మన్ పదవిని ఇప్పుడు పార్టీ కోసం ఇచ్చేశానంటూ చెప్పుకొచ్చారు రఘురామ. తనపై అనర్హత వేటు తప్పదంటున్న మూర్ఖులు దమ్ముంటే అమరావతి అజెండాగా ఉప ఎన్నిక పెడతామని ముఖ్యమంత్రితో ప్రకటింపచేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు.
RELATED STORIES
Oscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMT