త్వరలో తనపై దాడి జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణరాజు
By - Nagesh Swarna |28 Sep 2020 1:22 PM GMT
హిందూ మతం పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న తనపై దాడి జరగవచ్చని.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఉండి నియోజకవర్గంలో తన గడ్డిబొమ్మలు తగలబెట్టేందుకు ఓ పెద్ద నేత ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. మతం మార్చుకున్నా దళితులుగా కొనసాగుతున్న కొద్ది మంది వల్ల అసలైన దళితులకు రిజర్వేషన్లలో నష్టం జరుగుతుందని చెప్పినందుకే... తనపై దాడులా అని ప్రశ్నించారు. నేడు ఉండితో ప్రారంభమైన తన దిష్టిబొమ్మల దగ్ధం.. రేపు ఇతర నియోజకవర్గాల్లో కూడా కొనసాగే అవకాశం ఉందన్నారు రఘురామ కృష్ణరాజు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com