చిత్తూరుజిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

చిత్తూరుజిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్
భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చిప్పిలి హెలిపాడ్ వద్ద దిగి..మదనపల్లి సమీపంలోని సత్సంగ్ ఫౌండేషన్ కు చేరుకున్నారు. అక్కడ భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి.. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సత్సంగ్‌ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అక్కడినుంచి పీపుల్స్‌గ్రోస్ స్కూలుకు చేరుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story