somu veerraju : జగన్ సెక్యులర్ అవునా కాదా..? సోము వీర్రాజు
By - /TV5 Digital Team |17 Aug 2021 3:15 PM GMT
సీఎం జగన్లో మతతత్వ వైఖరి కనబడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్లో మతతత్వ వైఖరి కనబడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. జగన్ సెక్యులర్ అవునా కాదా..? అని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం కాదు.. అబ్దుల్ కలాం విగ్రహం పెట్టాలని అన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని అన్నారు. ఆంగ్లాన్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దాలని చూస్తున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. జగన్ అనవసరంగా చేస్తున్న అప్పుల్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. అప్పు-నిప్పు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com