AP: బ్రిడ్జ్ పై నుంచి తోసేసిన సవతి తండ్రి, పైప్ లైన్ తో ప్రాణాలు కాపాడుకున్న చిన్నారి

AP: బ్రిడ్జ్ పై నుంచి తోసేసిన సవతి తండ్రి, పైప్ లైన్ తో ప్రాణాలు కాపాడుకున్న చిన్నారి

సవితి తండ్రి బ్రిడ్జిపై నుంచి తోసేయడంతో గోదావరిలో పడిన చిన్నారి, పైప్ లైన్ ద్వారా ప్రాణాలు కాపాడుకుని పోలీసులకు కాల్ చేసిన వైనం రావులపాలెంలో చోటుచేసుకుంది. చిన్నారి ఫోన్ కాల్ కు సత్వరమే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టం మీద పైప్ లైన్ ను పట్టుకుని వేలాడుతోన్న 13ఏళ్ల కీర్తన రక్షించారు. అనంతరం ఆమె వెల్లడించిన వివరాలు పోలీసుల వెన్నులో వణుకుపుట్టించాయి.

గుంటూరుకు చెందిన పుప్పాల సుహాసిని (38)కి ఇద్దరు [కీర్తన(13), జెర్సీ(1)] కూతుళ్లతో ఒంటరిగా జీవస్తోంది. ఈ క్రమంలో ఉలవ సురేశ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్యా ఎలాంటి బేధాభిప్రాయాలు వచ్చాయో ఏమో సుహాసినీ సహా ఇద్దరు చిన్నారులను రావులపాలెం గౌతమీ బ్రిడ్జ్ దగ్గరకు తీసుకువచ్చిన సురేశ్ ముగ్గురినీ బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలోకి తోసేశాడు. అయితే కీర్తన వంతనకు దగ్గరగా పడటంతో దానికి ఆనుకుని ఉన్న ప్లాస్టిక్ కేబుల్ పైపును దొరకబుచ్చుకుని ప్రాణాలు నిలుపుకుంది. వెంటనే తన ప్యాంట్ పాకెట్ లో ఉన్న సెల్ ఫోన్ తీసి 100 కు డైల్ చేసింది.


ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. అయితే కీర్తన తల్లి సుహాని, ఏడాది వయసున్న ఆమె చెల్లి జాడ మాత్రం తెలియలేదు. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story