కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా.. - టీడీపీ

కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా.. - టీడీపీ

మాజీ సీఎం చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించడంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆ పార్టీ లీడర్లు ఆరోపించారు. లోకేష్ ను జడ్ కేటగిరీ నుంచి వై ప్లస్ కు తగ్గించడం అలాగే భువనేశ్వరి, బ్రహ్మణికి పూర్తిగా తొలగించడాన్ని ఖండించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తోపాటు వారి కుటుంబ సభ్యులకూ భద్రత కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమైన సీనియర్ లీడర్లు పలు అంశాలపై చర్చించారు.

ప్రజావేదికను కూల్చాలన్న నిర్ణయం కూడా సరైందికాదన్నారు టీడీపీ నేతలు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నీ అనుమతుల్లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని గుర్తుచేశారు. కరకట్టలోపల అక్రమంగా నిర్మించిన చాలా భవనాల్లో అప్పటి ఉడా ఛైర్మన్ మల్లాది విష్ణు నిర్మించినవే అన్న విషయం సీఎం జగన్ కు గుర్తులేదా అని నిలదీశారు టీడీపీ నేతలు.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన భవనాన్ని క్రమబద్దీకరించాలంటూ వైఎస్సార్ అప్పట్లో రాసిన లేఖ విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించారు .

ఏపీలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోవడంపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రుద్రమాంబపురంలో టీడీపీ మహిళ కార్యకర్త పద్మ సూసైడ్ చేసుకోవడంపై నేతలు స్పందించారు.. వెంటనే ఆ గ్రామంలో పర్యటించి కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో విత్తనాల కొరత పెరిగిపోవడంపైనా సమావేశంలో చర్చించారు టీడీపీ నేతలు... ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాల పంపిణీ సక్రమంగా జరిపి..రైతుల ఇబ్బందులను తొలగించాలని నేతలు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story