దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి : పట్టాభి

దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి : పట్టాభి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సవాలును వైసీపీ నేతలు స్వీకరించాలన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు తన పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలన్నారు. మీ నాయకుడు ఎలాంటి ఉద్యమాలుచేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డంగా దోచేశారని ఆయన మండిపడ్డారు. అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళల గురించి నోటికొచ్చినట్లుమాట్లాడితే సహించేది లేదన్నారు పట్టాభి. వైసీపీ నేతలకు దమ్ముంటే ఇళ్లల్లో అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు. ఓబులాపురం మైనింగ్ పై చర్చించే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story