By - Subba Reddy |10 Jun 2023 7:30 AM GMT
ఉదయగిరి సిట్టింగ్ MLA మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TV5తో మాట్లాడుతూ..YCP మునిగిపోయేనావ అని అన్నారు. పడిపోయింది ఎమ్మెల్యేల గ్రాఫ్ కాదని, CM జగన్ గ్రాఫ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే యువ గళం పాదయాత్రతో రాష్ట్రంలో TDP చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. నెల్లూరు నుంచే జగన్ పై తిరుగుబాటు మొదలైందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జోష్యం చెప్పారు. నెల్లూరు జిల్లా రాజకీయాల పై నారా లోకేష్ తో సమగ్రంగా చర్చించానన్నారు. అలాగే YCPని వీడేందుకు కీలక వ్యక్తులు రెడీగా ఉన్నారని తెలిపారు. తాను కూడా అతి తొందరలో TDPలో చేరుతానని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com