రైతుగా మారిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌..!

రైతుగా మారిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌..!
ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ రైతుగా మారారు. తన స్వగ్రామం కౌకుంట్ల పొలాల్లో వరి పైరు నాటేందుకు భూమిని సిద్ధం చేశారు.

ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ రైతుగా మారారు. తన స్వగ్రామం కౌకుంట్ల పొలాల్లో వరి పైరు నాటేందుకు భూమిని సిద్ధం చేశారు. మడిలో ట్రాక్టర్‌ నడిపారు. అనంతరం వేరుశెనగ కలుపు తీస్తూ తోటి రైతులతో సరదాగా గడిపారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే పయ్యావుల కేశవ్‌... తన పొలంలో సేద్యం చేయడంతో.... సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన .. తన మూలాలు మర్చిపోలేదంటూ ఆనందపడుతున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story