రైతులకు బేడీలు వేయమని ఆదేశించిన అజ్ఞాత వ్యక్తి ఎవరు?: వర్ల రామయ్య

రైతులకు బేడీలు వేయమని ఆదేశించిన అజ్ఞాత వ్యక్తి ఎవరు?: వర్ల రామయ్య

అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని తప్పుబడుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. సుప్రీం కోర్టు ఆదేశాలు దిక్కరిస్తూ బేడీలు వేయడం క్షమించరాని నేరమని లేఖలో పేర్కొన్నారు. రైతులు అందరికీ తెలిసినవారే.. పారిపోయే వాళ్లు కాదు.. మరి బేడీలు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులకు ఎవరి ఆదేశాల మేరకు బేడీలు వేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడం కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేయడం కోసం బేడీలు వేయించారా అని లేఖలో ప్రశ్నించారు. ఎస్కార్టు సిబ్బందిని, రైతులకు బేడీలు వేయమని ఆదేశించిన అజ్ఞాత వ్యక్తి ఎవరు?.. ఈ కేసు విచారణ అధికారి గత చరిత్ర దృష్ట్యా, మరో అధికారితో కేసు పునర్ విచారణ చేయాలని కోరారు.. రాష్ట్ర డీజీపీగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని.. పోలీసుల గౌరవాన్ని కాపాడాలని లేఖలో వెల్లడించారు..


Tags

Read MoreRead Less
Next Story