Vizianagaram: మునకలవలసలో ఉద్రిక్తత.. కర్రలు,ఇనుప రాడ్లతో దాడి

Vizianagaram: మునకలవలసలో ఉద్రిక్తత.. కర్రలు,ఇనుప రాడ్లతో దాడి
స్థల వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పర ఇరు కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు

విజయనగరం జిల్లా రేగిడి మండలం మునకలవలసలో ఉద్రిక్తత నెలకొంది. స్థల వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలు, ఇనుప రాడ్లతో పరస్పర ఇరు కుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 8మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో కొంత మంది ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. బాదితులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story