గన్నెవారిపల్లిలో అరాచకాలు సృష్టించిన వైసీపీ శ్రేణులు

గన్నెవారిపల్లిలో అరాచకాలు సృష్టించిన వైసీపీ శ్రేణులు

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గ్రామంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. గాయపడిన రమణతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించిన తాడిపత్రి టీడీపీ ఇన్‌ఛార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డి.. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దెబ్బలు తిన్నవారిపై నాన్‌బెయిలబుల్, కొట్టినవారిపై బెయిలబుల్ కేసులా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అభివృద్ధి చేయడం చేతకాక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడులకు భయపడేది లేదని, వైసీపీ తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటామని హెచ్చరించారు. సామాన్యులపై దాడి చేయడం పెద్దారెడ్డి ప్రతాపమా అని నిలదీశారు. పంచాయతీల్లో అవకతవకలు జరిగాయని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, మీరో- మేమో ఎన్నికల్లో తేల్చుకుంటామని అస్మిత్‌రెడ్డి సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story