Mumbai: తల్లిని చంపి... ముక్కలుగా చేసి... స్టీలు గిన్నెల్లో దాచిన కూతురు....

Mumbai: తల్లిని చంపి... ముక్కలుగా చేసి... స్టీలు గిన్నెల్లో దాచిన కూతురు....
ముంబైలో ఘోరం; తల్లినే చెంపిన తనయ; రెండు నెలలుగా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు; చివరికి...

నవ మాసాలు మోసింది... అల్లారు ముద్దుగా కూతురుని పెంచుకుంది... కంటిరెప్పలా కాపాడుకుంది. కానీ, కన్న పేగే తన ఊపిరి తీస్తుందని ఊహించలేదు. కన్న రుణం తీర్చుకోవాల్సింది పోయి, కసాయిగా మారిందా కూతురు. తల్లిని ముక్కులుముక్కలుగా చేసి ఇంట్లోనే దాచిపెట్టింది. బంధువుల చొరవతో ఆ కర్కస హృదయురాలి బండారం బట్టబయలు అయింది.

ఈ ఘోరం ముంబైలో చోటుచేసుకుంది. వీణా జైన్ (55)అనే మహిళ కూతురు రింపుల్ జైన్(24) తో కలిసి నివశిస్తోంది. అయితే కొంతకాలంగా విణా సోదరుడు సురేశ్ కుమార్ (60) ఆమెను కలిసేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె కూతురు రింపుల్ అందుకు అడ్డుపడుతోంది. ఫోన్ మాట్లాడనివ్వకుండా, ఇంటికి వచ్చినా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటోంది. దీంతో సురేశ్ అతడి కుమార్తెకు వెళ్లి చూడవలసిందిగా చెప్పడంతో ఆమె రింపుల్ ను పక్కకు నెట్టి బలవంతంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇంటి నుంచి దర్ఘంధం రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు స్నానాల గదిలోనూ, ఇంటిలోనూ పెద్ద స్టీలు గిన్నెల్లోనూ కుళ్లిపోయిన దశలో ఉన్న వీణా జైన్ శరీర భాగాలను కనుగొన్నారు. వీణా హత్యకు గురై రెండు నెలలు కావొస్తోందని తెలుస్తోంది. తల్లిని చంపిన దగ్గర నుంచి రింపులు ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లడంలేదని, కావాల్సిన సరుకులను ఆన్ లైన్ లోనే ఆర్డర్ చేసుకుంటోందని పోలీసులు వివరించారు. ఈ మేరకు రింపుల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యప్తు ముమ్మరం చేశారు.



Tags

Read MoreRead Less
Next Story