ఆదిలాబాద్ లో చరిత్ర సృష్టిస్తాం: ఓవైసీ

ఆదిలాబాద్ లో చరిత్ర సృష్టిస్తాం: ఓవైసీ

ఆదిలాబాద్ లో చరిత్ర సృష్టిస్తామని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల కాలనీల్లో సమస్యలను అధికారులు, నాయకులు పరిష్కరించడంలేదని అన్నారు. ఒవైసీ చేతిలో తెలంగాణ సర్కారు స్టీరింగ్ ఉందని అమిత్ షా అనడం నిజం కాదని తెలిపారు.


ఓవైసీ కళ్లలో ఆనందం కోసం‌ కేసీఆర్ సెక్రటేరియట్ నిర్మించారని బిజెపి నాయకులు ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు.ఆ వ్యాఖ్యలన్నీ అబద్దాలని చెప్పారు. సెక్రటేరియట్ నమూనా గుజరాత్ ‌ హన్ మాన్ మందిరం నుండి తీసుకున్నారని షాకింగ్ కామెంట్ చేశారు. ఇస్లామిక్ సెంటర్ గచ్చిభౌలిలో నిర్మించలేదని.. అది బ్రాహ్మనుల సెంటర్ అని అన్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే ఇవి ఎలా నిర్మించారో బిజెపి నాయకులు సమాదానం చెప్పాలని అన్నారు.

సెక్రటేరియట్ నన్ను అడిగి నిర్మించలేదని ఓవైసీ తెలిపారు. తనను అడిగితే చార్మినార్, తాజ్ మహల్ లా నిర్మించమని చెప్పేవాన్నని అన్నారు. షాది ముబారక్ చెక్ లు సంవత్సరం అయినా రావడం లేదని తెలిపారు. ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు మా సత్తాచాటుతామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story