ఆధునిక హంగులతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్

ఆధునిక హంగులతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్
అత్యాధునిక హంగులతో ఈ వాహనాన్ని తీర్చిదిద్దామని

హై స్పీడ్ బైక్‌లను మెచ్చే యువత కోసం మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనం వచ్చింది. ఐఐటి హైదరాబాద్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్.. ప్యూర్ ఈవీ నుంచి ఈ సరికొత్త స్కూటర్ ఎట్రాన్స్ నియో వస్తోంది. అధిక వేగం, మంచి పికప్‌తో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అత్యాధునిక హంగులతో ఈ వాహనాన్ని తీర్చిదిద్దామని కో ఫౌండర్ రోహిత్ వదేరా అన్నారు. ఇది ప్యూర్ ఈవీ నుంచి వచ్చిన రెండో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మొదటిది ప్లూటో 7 జీ పేరుతో వచ్చి మార్కెట్లో మంచి పేరే తెచ్చుకుంది.

కాగా, ఎట్రాన్స్ నియో డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ.75,999గా నిర్ణయించారు. మొదటి ఏడాదిలో 10 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మోడల్ మొదటగా హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉంటుంది. ఈ వాహనం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ చార్జ్‌పై 120 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా తప్పనిసరిగా అవసరమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story