దీపావళి గిఫ్ట్..గురువారం మధ్యాహ్నం మీడియా ముందుకు ఆర్థికమంత్రి
By - Nagesh Swarna |12 Nov 2020 5:37 AM GMT
గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు రానున్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. గత మేలో రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం మరోమారు ప్యాకేజీని ప్రకటించనున్నట్టు ఆర్థిక శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com