సీజీ పవర్ లో మెజార్టీ వాటా మురగప్ప చేతికి

సీజీ పవర్ లో మెజార్టీ వాటా మురగప్ప చేతికి

పీకల్లోతు సంక్షోభంలో ఉన్న సీజీ పవర్ సోల్యూషన్స్ కంపెనీలో మెజార్టీ వాటాను మురుగప్ప గ్రూపు సొంతం చేసుకుంది. స్విచ్ ఛాలెంజ్ పద్దతిలో బిడ్ వేసిన మురగప్ప కంపెనీకి చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్ ఇండియా కంపెనీ దాదాపు రూ.700 కోట్లుకు 56.61శాతం చేజిక్కించుకుంది. దీనికి సంబంధించి స్టాక్ ఎక్చేంజికి సమాచారం అందించారు. అయితే దీనికి ఇంకా కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రావాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంకు నిబంధల ప్రకారం బిడ్లు ఆహ్వానించడగా ట్యూబ్స్ ఇన్వెస్ట్మెంట్ మెంట్ ఇండియా కంపెనీ విజయవంతంగా బిడ్ గెలుచుకుందని ప్రకటన వచ్చింది. సీజీ పవర్ కంపెనీకి బ్యాంకుల్లో దాదాపు రూ.2480 కోట్ల అప్పులున్నాయి. దీంతో కంపెనీలో వాటాలు విక్రయించడం ద్వారా తమ అప్పులు జమచేసుకోవాలని భావించాయి. తాజా ఒప్పందంతో కేవలం 45శాతం బకాయిలు మాత్రమే తీరనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story