గోల్డ్‌బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్.. రెట్టింపు లాభం

గోల్డ్‌బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్.. రెట్టింపు లాభం
గోల్డ్ బాండ్ ధర పెరగడం మాత్రమే కాదు వాటిపై వడ్డీ కూడా వస్తుంది.

పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే అది అవసరానికి ఆదుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇదే గోల్డ్ బాండ్ స్కీమ్. అ స్కీమ్ చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. 2015 నవంబర్‌లో గోల్డ్ బాండ్లలో డబ్బులు పెట్టిన వారికి ఇప్పుడు కలిసివచ్చింది. అప్పుడు గోల్డ్ ధర గ్రాముకు రూ.2,683గా ఉంది. ప్రస్తుతం గోల్డ్ బాండ్ ధర రూ.5135 కి చేరుకుంది.

అప్పుడు కొని పెట్టుకున్న బాండ్లను ఇప్పుడు విక్రయిస్తే దాదాపు రెట్టింపు లాభం వస్తుంది. ఐదేళ్లలో అధిక రాబడిని తీసుకువచ్చిన పసిడి బాండ్లు ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయడం ఉత్తమం. గోల్డ్ బాండ్లలో ముందుగా ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు 90 శాతం లాభం వస్తోంది. ప్రతి ఏడాది 14 శాతం రాబడి వచ్చిందని చెప్పుకొవచ్చు. గోల్డ్ బాండ్ ధర పెరగడం మాత్రమే కాదు వాటిపై వడ్డీ కూడా వస్తుంది. వీటిపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. గోల్డ్ బాండ్లు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి. అందువల్ల వీటిని ఎప్పుడైనా అమ్మొచ్చు, కొనొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story