గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
By - Vijayanand |2 Jun 2023 4:53 AM GMT
బీజేపీ సైతం... తెలంగాణ దశాబ్ధి వేడుకలను వైభవంగా నిర్వహించబోతోంది. గోల్కొండ కోటలో.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి...తెలంగాణ అవిర్భావ ఉత్సవాలను ప్రారంభిస్తారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలి పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సాధన ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని, సకల జనుల సమైక్య పోరాటంతో.. 12 వందల మంది ఆత్మబలిదానాలతో.. తెలంగాణ ఆవిర్భంచిందన్నారు. రాష్ట్ర సాధనలో.. బీజేపీ సైతం తెలంగాణ గుండె చప్పుడయిందన్నారు. ఇప్పటికే గోల్కండ కోటక వెళ్లి ఏర్పాట్లను స్వయంగా తెలుసుకున్నారు కిషన్ రెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com