Tollywood : మామా మశ్చీంద్రా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Tollywood : మామా మశ్చీంద్రా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా రానున్న సినిమా మామా మశ్చీంద్రా... ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది.

"గాలుల్లోనా కలలే వాలే కనురెప్పే దాటే కొత్తగా సరికొత్తగా... " అంటూ ప్రేక్షకులను, సుధీర్ బాబు అభిమానులను ఈ పాట అలరిస్తోంది. సుధీర్ బాబు ఈషా రెబ్బ జంట కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే వీరి కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ పాయింట్ అయినట్లు సినీవర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిచగా.. విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. హర్షవర్దన్ దర్శకత్వం వహించగా సునీల్ నారంగ్, పుష్కర్ రాం మోహన్ ఈ సినిమాను నిర్మించారు.

Tags

Read MoreRead Less
Next Story