Maheswari : వడ్డే నవీన్ అసలు మాట్లాడేవాడు కాదు.. మా ఇద్దరి మధ్య : మహేశ్వరి

Maheswari :  వడ్డే నవీన్ అసలు మాట్లాడేవాడు కాదు.. మా ఇద్దరి మధ్య  : మహేశ్వరి
Maheswari : గులాబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మహేశ్వరి.. ఆ తర్వాత నీకోసం, పెళ్లి, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు హిట్ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.

Maheswari : సినీ నటి మహేశ్వరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మహేశ్వరి.. ఆ తర్వాత నీకోసం, పెళ్లి, మా బాలాజీ, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు హిట్ చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి విచ్చేసిన మహేశ్వరి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకి చాలా పొగరని చాలా మంది అనుకునేవారని, కానీ 'స్వతహాగా నేను చాలా సైలెంట్ అని తెలిపింది. ఇక శ్రీదేవితో తనుకున్న రిలేషన్ గురించి వెల్లడించింది. శ్రీదేవి తనుకు పిన్ని అవుతారని, కానీ అక్క అని పిలిచేదాన్నని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీదేవి లేరన్నది నమ్మబుద్ధికావడంలేదని అంది. 'గులాబి' చిత్రం అంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదని మహేశ్వరి తెలిపింది.

ఇక హీరో వడ్డే నవీన్ గురించి మాట్లాడుతూ.. తనతో రెండు సినిమాలు చేశానని, సెట్ లో నవీన్ పెద్దగా మాట్లాడరని,తాను కూడా సైలెంట్ గా ఉండేదానిని అని ఇద్దరి మధ్య గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ తప్ప మరో మాట ఉండేది కాదని తెలిపింది. దీనికి తోడు మా బాలాజీ సినిమాలో తన పాత్ర మూగ పాత్ర అంటూ నవ్వుతూ గుర్తుచేసుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు మహేశ్వరి సినిమా పరిశ్రమను విడిచిపెట్టింది. 2008లో తిరుపతిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన జయకృష్ణను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పలు సీరియల్స్ నటించి మెప్పించింది మహేశ్వరి.



Tags

Read MoreRead Less
Next Story